తప్పు తెలుసుకుని ట్వీట్ మార్చేసిన ‘BRO’ బ్యూటీ..

by Disha Web Desk 7 |
తప్పు తెలుసుకుని ట్వీట్ మార్చేసిన ‘BRO’ బ్యూటీ..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బ్రో’ సినిమా నిన్న (జూలై-28)న రిలీజై మంచి టాక్‌తో దూసుకుపోతుంది. దీంతో మూవీ టీం ప్రస్తుతం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బ్రో మూవీలో స్పెషల్ పర్పార్మెన్స్‌తో సందడి చేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ.. ఇటీవల పవన్ కళ్యాణ్ సీఎం అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ‘‘ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో బ్రో ది అవతార్ చిత్రంలో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. బ్రో మూవీ రేపు రిలీజ్ అవుతోంది’’ అంటూ ఆమె చేసిన ట్వీట్‌పై అనేక ట్రోల్స్ వచ్చాయి.

అయితే పవన్ కళ్యాణ్‌ను సీఎం అనడంతో ఊర్వశిని సపోర్ట్ చేస్తూ కొంతమంది రిప్లైలు ఇస్తే మరికొందరు మాత్రం ట్రోల్స్ చేశారు. దీంతో అసలు విషయం గమనించిన ఊర్వశి.. గంట తర్వాత తన ట్వీట్‌ను సరిచేసింది. ఈ మేరకు ‘‘గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. 28న మా బ్రో సినిమా రిలీజ్ కాబోతుంది’’ అంటూ ఎడిట్ చేసిన ట్వీట్‌లో ఉంది.

Also Read: ‘BRO’ మిక్స్‌డ్ టాక్ రావడమేంటి.. రిపోర్టర్‌పై ఫైర్ అయిన Sai Dharam Tej & డైరెక్టర్


Next Story