'కోనసీమ థగ్స్'.. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్

by Disha Web Desk 13 |
కోనసీమ థగ్స్.. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్
X

దిశ, సినిమా: ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'కోనసీమ థగ్స్' ను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకత్వంలో హ్రిదు హరూన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన సినిమాను.. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ షిబు తమీన్స్ కూతురు రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై జియో స్టూడియోస్ భాగస్వామ్యంతో భారీ స్థాయిలో నిర్మించారు. అయితే వీరికి మైత్రీ సంస్థ(మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి) జతకలవడంతో అంచనాలు పెరిగిపోయాయి. కాగా, ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుండగా.. ఈ నెల 19న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది చిత్ర యూనిట్.

Next Story