చేపలు, రొయ్యలు అమ్మి ఈ స్థాయికి వచ్చాను.. అక్షయ్ భార్య

by Disha Web Desk 9 |
చేపలు, రొయ్యలు అమ్మి ఈ స్థాయికి వచ్చాను.. అక్షయ్ భార్య
X

దిశ, సినిమా: ట్వింకిల్ ఖన్నా మరోసారి ఆసక్తికర విషయాలతో అభిమానులను అలరించింది. నిరంతరం సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యామిలీ, ఫ్యాషన్, ఇంటిరియర్ డిజైన్‌ల గురించిన అప్‌డేట్‌లను షేర్ చేసుకునే నటి రీసెంట్‌గా లైఫ్‌లో చేసిన మొదటి పనిగురించి చెప్పింది. ‘మా అమ్మమ్మ చెల్లెలు చిన్న అమ్మమ్మవాళ్లకు చిన్నపాటి చేపల దుకాణం ఉండేది. దీంతో నా ఫ్రెండ్స్‌ ఇళ్లలోకి వెళ్లినపుడు వాళ్ల పేరెంట్స్ నాతో ‘మీరు మత్య్సకారులా?’ అని అడిగేవారు. అంతేకాదు వాళ్లకు కావాల్సిన చేపలు పంపించమని నాతో కబురు పంపేవారు. అయితే ఈ విషయం అమ్మమ్మకు చెప్పినందుకు నాతోనే కొంతకాలం చేపలు, రొయ్యలను డోర్ డెలివరీ చేయించింది’ అంటూ సరదాగా చెప్పుకొచ్చింది.

Also Read: ఇలాంటి ప్రశ్నలు మగాళ్లను ఎందుకు అడగరు? దానికి మేమే బాధ్యులమా


Next Story

Most Viewed