'సర్ధార్' ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌గా కింగ్ నాగార్జున..

by Disha Web Desk 16 |
సర్ధార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌గా కింగ్ నాగార్జున..
X

దిశ, సినిమా: కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'సర్ధార్'. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో రజీషా విజయం, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ టీజర్, సాంగ్స్, ట్రైలర్ మూవీ‌పై భారీ అంచనాలు పెంచుతున్నాయి. ఇదిలావుంటే.. ఈ మూవీని తెలుగులో అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. అయితే రీసెంట్ అప్‌డేట్ ప్రకారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అక్టోబర్ 19న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ మాదాపూర్‌లోని దసపల్లా కన్వెన్షన్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఇక ఈ ఈవెంట్‌కి చీఫ్‌గెస్ట్‌గా కింగ్ నాగార్జున రాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించగా.. అక్టోబర్ 21న తెలుగు, తమిళ భాషల్లో సినిమా రిలీజ్‌కానుంది.

Next Story

Most Viewed