12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్న టాలీవుడ్ హీరోయిన్

by Disha Web Desk 9 |
12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్న టాలీవుడ్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ‘లయ’ చాలా సినిమాల్లో ఫ్యామిలీ హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. 1999లో వచ్చిన ‘స్వయంవరం’ చిత్రంలో వేణు తొట్టెంపూడి సరసన నటించింది. తెలుగు, మలయాళం, కన్నడ ఫ్యామిలీ చిత్రాల్లో నటించి, 2006లో కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ తన కుటుంబానికే పూర్తి సమయాన్ని కేటాయించింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత చెక్కుచెదరని అందంతో స్క్రీన్‌పై కనిపించనుంది. ఉగాది సందర్భంగా ‘ఈటీవీ’లో మార్చి22న ప్రసారం కానున్న ‘కలిసుందాం రండి’ ఈవెంట్ కోసం రీసెంట్‌గా షూట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్‌కు లయ చీరకట్టులో ఎంట్రీ ఇచ్చారు. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఈ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేయనున్నాడు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు ప్రసారం కానుంది. ఈ సందర్భంగా లయ షోలో సందడి చేసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యాన్స్‌తో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరొక తాజా విషయం ఏంటంటే.. కొన్నేళ్లుగా సినిమాలకు దూరమైన ఈ నటి మళ్లీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్య పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయని సోషల్ మీడియాలో టాక్ వస్తుంది. దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.





Next Story

Most Viewed