అన్నా నువ్వు నేలపై నిలబడే సినిమాలు తీయవా.. టైగర్ ష్రాఫ్‌పై వైరల్ కామెంట్స్

by Disha Web Desk 7 |
అన్నా నువ్వు నేలపై నిలబడే సినిమాలు తీయవా.. టైగర్ ష్రాఫ్‌పై వైరల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌‌డెస్క్: బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘గణపథ్’. హైఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ పార్ట్-1 అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మూవీ టీం. ఈ క్రమంలోనే ‘గణపథ్’ టీజర్‌ని మెగాస్టార్ చిరంజీవితో లాంచ్ చేయించారు. ఫుల్ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా టీజర్ మొత్తం హీరో గాల్లోనే ఫైట్ చేస్తున్నట్లు ఉండటంతో.. అన్నా నువ్వు నేలపై నిలబడే సినిమాలు చేయవా అంటూ అభిమానులు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. వికాస్ భల్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ 1:45 నిమిషాల నిడివితో టీజర్ కట్ చేశారు. కాగా.. ఈ టీజర్ మొత్తం చూస్తుంటే ఇది యాక్షన్ లవర్స్‌కు మాత్రమే అన్నట్లు ఉంది. కానీ.. ఈ మూవీ రిలీజ్ కోసం మాత్రం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న టైగర్ అభిమానులు.



Next Story