సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?

by Disha Web Desk 7 |
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ వంశీ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. గజదొంగ స్టూవర్టుపురం నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవల్‌ల్లో రిలీజైంది. దసరా సెలవుల్లో బొమ్మపడినా యావరేజ్ టాక్‌నే సొంతం చేసుకుంది. ఇక అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మేరకు అమెజాన్ ప్రైం ట్విట్టర్ వేదికగా.. ఈ రోజు నుంచి ‘టైగర్ నాగేశ్వరరావు’ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ట్వీట్ చేసింది. ప్రస్తుతానికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సినిమా అందుబాటులోకి రాగా.. హిందీ వెర్షన్‌కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. మరి ఓటీటీ ప్లాట్ ‌ఫాంలో ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Next Story

Most Viewed