శ్రీదేవి దిగిన చివరి ఫోటో ఇదే.. ఎవరితో అంటే?

by Disha Web Desk 4 |
శ్రీదేవి దిగిన చివరి ఫోటో ఇదే.. ఎవరితో అంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: అందార తార శ్రీదేవి భారతదేశ చలనచిత్ర రంగంలో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అతిలోక సుందరిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లోనూ చెరగని ముద్ర వేసుకున్నారు. తన నటన, అభినయంతో అనేక మంది అభిమానులను ప్రపంచ వ్యాప్తంగా సంపాదించుకున్నారు. అయితే తాజాగా శ్రీదేవి భర్త బోనీకపూర్ తన వైఫ్ తో దిగిన చివరి ఫోటోను ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకున్నారు.

కాగా బోనీ కపూర్ పోస్ట్‌లు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఈ ప్రొడ్యూసర్ తరచూ తన కుటుంబానికి సంబంధించి పోస్ట్ లు పెడుతుంటారు. ఈ సారి శ్రీదేవితో చివరి సారిగా దిగిన ఫోటోను బోణికపూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బంధువుల పెళ్లిలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీదేవి ఈ ఫోటోను దిగారు. అయితే దివంగత నటి శ్రీదేవి ఫిబ్రవరి 2018 లో దుబాయిలో కన్నుమూసిన విషయం తెలిసిందే.

ఈ ఫోటోలో బోణికపూర్, శ్రీదేవి, చిన్న సోదరి ఖుషి కపూర్, బోణి కపూర్ సిస్టర్ రీనా కపూర్ లు ఉన్నారు. ఈ ఫోటోను పెళ్లిలో వీరంతా కలిసి దిగారు. తన భార్య జ్ఞాపకాలతో ఈ ఫోటోను షేర్ చేసిన బోణి కపూర్ లాస్ట్ పిక్చర్ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ కు రిప్లై ఇచ్చిన ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర రెడ్ హార్ట్ సింబల్ ను పోస్ట్ చేశారు. ఈ వారంలోనే బోణి కపూర్ మరో ఫోటోను షేర్ చేస్తూ 'నీవు మానుంచి దూరమై 5 ఏళ్లు గడిచిందని.. నీ జ్ఞాపకాలు తమతో జీవితాంతం ఉంటాయని రాసుకొచ్చారు.

జాహ్నవి కపూర్ సైతం తన తల్లి శ్రీదేవితో దిగిన ఫోటోను ఇన్ స్టా వేదికగా షేర్ చేసి ఇలా రాసుకొచ్చారు. ప్రతి చోటు నేను నీ కోసం వెతుకుతున్నాను మమ్మ.. నువ్వు గర్వపడేలా చేస్తాను. నేను వెళ్లే ప్రతి చోటు, చేసే ప్రతి పని నీతోనే ముగుస్తుంది. ఈ పోస్ట్ కు డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ రెడ్ హార్ట్ సింబల్ పోస్ట్ చేశారు. ఆయనతో పాటు మనీష్ మల్హోత్ర, రకుల్ ప్రీత్ సింగ్, సమంత ఈ ఫోటోకు స్పందిస్తూ రెడ్ సింబల్ పోస్ట్ చేశారు.


Next Story

Most Viewed