నా రేట్లు ఇంతే.. చేపల పులుసు తింటే తినండి లేకపోతే లేదు.. జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ సెన్సేషనల్ కామెంట్స్!

by Disha Web Desk 6 |
నా రేట్లు ఇంతే.. చేపల పులుసు తింటే తినండి లేకపోతే లేదు.. జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా కమెడియన్‌గా కిరాక్ ఆర్పీ బుల్లి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో స్కిట్స్ చేసి జనాలు నవ్వించాడు. అంతేకాకుండా పలు చిత్రాల్లోనూ కమెడియన్‌గా నటించి తన పాపులారిటీని పెంచుకున్నాడు. జబర్దస్త్ షోకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి కర్రీ పాయింట్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత నెల్లురు పెద్దారెడ్డి చేపల పులుసు అనే బ్రాంచ్‌లను రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి తన బిజినెస్‌ను అభివృద్ది చేసుకునే పనిలో ఫుల్ బిజీ అయిపోయాడు. అయితే ఇటీవల ఆర్పీ చేపల పులుసుకు మరీ దారుణంగా రేట్లు పెట్టి అమ్ముతున్నాడని నెట్టింట పలు వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరాక్ ఆర్పీ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ ఇది నా బిజినెస్. నా రేట్లు అంతే. మీకు నచ్చితే తినండి లేకపోతే లేదు. కొందరు కావాలనే నా బిజినెస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు నేను వండే చేపలకు, మిగతా వాటికి చాలా తేడా ఉంటుంది. రూ. 100 పెట్టుకుని.. రూ. 1000 ఫుడ్ కావాలంటే వస్తుందా? ఇది కూడా అంతే నా చేపల పులుసు తినండి అని నేను ఎవ్వరినీ బతిమాలాడను కదా? రేట్లు ఎంత పెట్టాలి అనేది నా ఇష్టం. నేను కూడా ఓ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినే నాకు తెలుసు రేట్లు ఎలా పెట్టాలి అనేది. ఎవరేం అనుకున్నా నేను పట్టించుకోను నా బిజినెస్ చేసుకుంటూ పోతాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కిరాక్ ఆర్పీ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన జనాలు షాక్ అవుతున్నారు.

Read More..

కన్నీళ్లు ఆగడం లేదు ఇలా జరగడం చాలా బాధగా ఉంది.. బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్



Next Story

Most Viewed