‘విరూపాక్ష’ టీమ్‌కు చేదు అనుభవం.. ఫోన్, పర్స్ కొట్టేసిన దొంగలు

by Disha Web Desk 7 |
‘విరూపాక్ష’ టీమ్‌కు చేదు అనుభవం.. ఫోన్, పర్స్ కొట్టేసిన దొంగలు
X

దిశ, సినిమా: సాయిధరమ్ తేజ్, కార్తీక్ వర్మ దండు కాంబోలో వచ్చిన చిత్రం ‘విరుపాక్ష’. శుక్రవారం ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో మూవీ టీమ్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది. పలు థియేటర్‌లో వెళ్లి ప్రేక్షకులను కలిసి కేక్ కట్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే నిర్మాత భోగవల్లి ప్రసాద్, దర్శకుడు కార్తీక్ వర్మ దండు హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్, సంధ్య, శ్రీరాములు, వంటి థియేటర్లకు వెళ్లి అక్కడ రెస్పాన్స్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ కార్తీక్ వర్మ దండు ఫోన్ చోరీకి గురైందని తెలుస్తోంది. అదే సమయంలో నిర్మాత భోగవల్లి ప్రసాద్ పర్సు కూడా కొట్టేసారట. అభిమానుల ముసుగులో ఉన్న కొంతమంది దొంగలు ఈ చర్యలకు పాల్పడి ఉంటారని అంటున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Also Read...

Puspha 2: ‘పుష్ప2’నుంచి బిగ్ అప్‌డేట్.. స్టార్ విలన్ ఎంట్రీ?

Next Story

Most Viewed