ఆకట్టుకుంటున్న ‘పరారీ’ సెకెండ్ టీజర్..

by Disha Web Desk 13 |
ఆకట్టుకుంటున్న ‘పరారీ’ సెకెండ్ టీజర్..
X

దిశ, సినిమా: శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్‌, గాలి ప్రత్యూష సమర్పణలో జి.వి.వి గిరి నిర్మించిన చిత్రం ‘పరారీ’. సాయి శివాజీ దర్శకత్వంలో యోగేశ్వర్, అతిధి జంటగా నటించిన చిత్రం మార్చి 30న రిలీజ్‌కానుంది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మూవీ పోస్టర్‌ను ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి, సెకండ్ టీజర్‌ను ప్రొడ్యూసర్ కౌన్సెల్ అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ మేరకు మాట్లాడిన అతిథులు.. ‘టీజర్ మాకు బాగా నచ్చింది.

కంటెంట్ ఉంటే సినిమా హిట్. సినిమాకి నిర్మాత బాగా ఖర్చుపెట్టి తీశారు అది విజువల్‌గా కనపడుతుంది. మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుతున్నాం’ అన్నారు. ఇక ‘ఒక లక్యంతో ఈ సినిమాని నిర్మించాం. మంచి కథ కథనాలతో తెరకెక్కిన మూవీ అందరిని మెప్పిస్తుంది’ అన్నారు నిర్మాత గిరి. చివరగా మాట్లాడిన చిత్ర బృందం.. చిత్రాన్ని బిగ్ హిట్ చేసి తమకు మంచి పేరు తీసుకురావాలన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed