‘మెగాస్టార్' కాళ్లు మొక్కిన లావణ్య త్రిపాఠి.. వైరల్ అవుతున్న ఫోటో

by Disha Web Desk 10 |
‘మెగాస్టార్ కాళ్లు మొక్కిన లావణ్య త్రిపాఠి.. వైరల్ అవుతున్న ఫోటో
X

దిశ,వెబ్ డెస్క్: నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన తోటి నటి లావణ్యను ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరూ లవ్ లో ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి జూన్‌ 09న ఈ జంటకు నిశ్చితార్ధం జరిగింది. నవంబర్ 01న వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. ఇక వివాహ అనంతరం ఈ నవ దంపతులు హైదరాబాద్ కు చేరుకున్నారు.

వీరి రిసెప్షన్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మాదాపూర్‌లోని ఎన్ కన్వెషన్‌లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక కోసం ఎన్ కన్వెషన్‌లోని హాలును అందంగా రెడీ చేసారు. రకరకాల పువ్వులు, లైటింగ్‌తో రిసెప్షన్ వేదిక అదిరిపోయింది. ఇక ఈ వేడుకలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, క్రీడాకారులు, మెగా అభిమానులు, సినిమా జర్నలిస్టులు పాల్గొన్నారు. టాలీవుడ్ స్టార్లు ఈ ఫంక్షన్ కు హాజరై కొత్త జంటకు అభినందనలు తెలిపారు.

ఈ వేడుకలో మెగాస్టార్ కాళ్లు మొక్కి లావణ్య త్రిపాఠి ఆశీస్సులు తీసుకుంది. ఈ ఫోటో చూసిన మెగా అభిమానులు రిసెప్షన్‌లో బెస్ట్ ఫోటో ఫర్ ఎవర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed