కీర్తి సురేష్ పీక పిసికి చంపేయాలనుకున్నా.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్

by Dishanational2 |
కీర్తి సురేష్ పీక పిసికి చంపేయాలనుకున్నా.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా:మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా, కీర్తి సురేష్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘భోళా శంకర్’. మెహర్‌ రమేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో ఉన్నాయి. ఇక పోతే ఈ మూవీ సెట్స్‌లో చిరంజీవి, కీర్తి సురేష్ పీక పట్టుకోవడం గతంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనిపై ప్రమోషన్స్‌లో స్పందించాడు. ‘మా ఇంట్లో తమిళనాడుకు చెందిన వంట మనిషి ఉన్నాడు. కీర్తికి కావాల్సిన భోజనం అతనే పంపేవాడు. తినేది తక్కువైనా ప్రతిరోజూ కీర్తి చాలా వెరైటీలు కావాలని డిమాండ్ చేసేది. ఉప్పు, కారం తగ్గితే ఫుడ్‌ను వెనక్కి పంపి, మళ్లీ సరిగ్గా చేయమనేది. అలా ఒకసారి షూట్‌లో బిజీగా ఉన్న టైమ్‌లో కీర్తి నా దగ్గరకు వచ్చి రేపు మెనూ ఏంటి అని అడిగింది. నాకు ఒక్కసారిగా కోపమొచ్చి ఫన్నీగా పీక పట్టుకున్నా. ఆ సమయంలో ఈ షాట్ తీశారు’ అని చిరంజీవి చెప్పుకొచ్చాడు.

Read More : చిరంజీవి కోసం 12 ఏళ్లు పోరాడి నీచంగా మాట్లాడిన వారిని జైలుకు పంపించా.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్

కూతురు వయసున్న హీరోయిన్‌తో చిరంజీవి కామ వేషాలు, చిలిపి పనులు..

Next Story

Most Viewed