చిరంజీవి కోసం 12 ఏళ్లు పోరాడి నీచంగా మాట్లాడిన వారిని జైలుకు పంపించా.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్

by Disha Web Desk 6 |
చిరంజీవి కోసం 12 ఏళ్లు పోరాడి నీచంగా మాట్లాడిన వారిని జైలుకు పంపించా.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా ‘భోళా శంకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, అక్కినేని సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం థియేటర్స్‌లో గ్రాండ్‌గా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో శిల్పాకళా వేదికలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో అల్లు అరవింద్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘ భోళా శంకర్ సినిమాకు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అయితే చిరు చూడని సక్సెస్ ఏముంది. ఆయనకు ఈ చిత్రంతో ఆల్ ది చెప్పాల్సిన అవసరం ఏముంది. మీరంతా ఆయన సినిమాలు చూస్తూ పెరిగితే.. నేను వాటిని చేస్తూ పెరిగాను. అయితే చిరుపై నాకున్న అభిమానం ఎంతటిదో ఈ వేదికపై చెప్పబోతున్నాను. చిరంజీవి గారు చేసే సేవల్ని కొందరు నీచంగా మాట్లాడతారని తెలిసి.. 12 ఏళ్లు పోరాడి మరి వారిని జైలుకే పంపించేంత వరకు వదల్లేలేదు’’ అంటూ చెప్పుకొచ్చారు.

Read More: ఆ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న స్టార్ డైరెక్టర్

Next Story

Most Viewed