రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపిన మణిరత్నం.. అదే కారణమట!

by Disha Web Desk 10 |
రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపిన మణిరత్నం.. అదే కారణమట!
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరక్కెకించిన తాజా చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌-2’. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో టీమ్ మొత్తం ప్రమోషన్స్‌ జోరుగా జరుపుకుంటుంది. ఇందులో భాగంగా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ.. ‘బాహుబలి’ని రెండు భాగాలుగా తీయకపోతే.. ‘పొన్నియన్ సెల్వన్’ కూడా చేసేవాడిని కాదు. ఈ విషయాన్ని చాలాసార్లు రాజమౌళికి చెప్పాను. ఎందుకంటే ‘బాహుబలి’ సినిమా మొత్తం ఇండస్ట్రీకి చారిత్రాత్మక సినిమాలు చేసే ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చింది. భారతీయ చరిత్రను సినిమాలుగా మార్చేందుకు రాజమౌళి చాలా మంది దర్శకనిర్మాతలకు పెద్ద మార్గాన్ని చూపారు. ఇందుకు నా తరపున, మా మూవీ టీమ్ తరఫున రాజమౌళి‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read.. దీపావళి కానుకగా శివకార్తికేయన్ 'అయలాన్' విడుదల

సల్మాన్ ఖాన్ స్మోకింగ్ వీడియో వైరల్.. నెటిజన్లు ఫైర్



Next Story

Most Viewed