- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుసు కదా, డ్యూడ్ సినిమాల ఓటీటీ తేదీలు ఫిక్స్..ఎప్పుడంటే ?
ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

దిశ, వెబ్ డెస్క్ : మొన్న దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ లిస్టులో హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా సినిమా కూడా ఉంది. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇలాంటి నేపథ్యంలో ఈనెల 7వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుసు కదా సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది.
అలాగే ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా కూడా ఈ నెల 14వ తేదీ అంటే వచ్చే వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ మూవీ నెట్ ఫిక్స్ లోనే రాబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక రెండు రోజుల కిందట రిలీజ్ అయిన రవితేజ మాస్ జాతర కూడా నెట్ ఫ్లిక్స్ లోనే రిలీజ్ కానుంది. ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.






