- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తాము తల్లిదండ్రులు కాబోతున్నమంటూ గుడ్ న్యూస్ చెప్పిన బుల్లితెర జంట.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో వెండితెర నటులే కాకుండా బుల్లితెర నటులు కూడా పెళ్లి కబుర్లు, మాతృత్వ ఆనందాలను పంచుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా వాడకం ఎక్కువైపోయినప్పటి నుంచి ఏ చిన్న విషయం అయిన అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బుల్లితెర నటి మహేశ్వరి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇకపోతే మరో బుల్లితెర యాక్టర్ మోనిత అలియాస్ శోభ శెట్టి ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు మరో బుల్లితెర సీరియల్ జంట ఆ లిస్ట్ లోకి తాజాగా చేరింది.
బుల్లితెర నటుడు చందన్ కుమార్ అతని భార్య కవిత త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నమంటూ.. సోషల్ మీడియాలో ఓ ఫోటోతో పోస్ట్ ని షేర్ చేశారు... ఇంతకీ చందన్ ఎవరనుకుంటున్నారా? అదేనండి మనం ఎంతో ఆదరించిన ‘సావిత్రమ్మ గారి అబ్బాయి’ సీరియల్లో హీరోగా నటించి తన యాక్టింగ్ తో ఆడియోన్స్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు కదా అతనేనండి చందన్. ఇక ఈ పోస్ట్ షేర్ చేసిన ఈ జంటకు అభిమానులు, పలువురు నటి, నటులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉంటే.. మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న చందన్ ఈ క్రమంలోనే ‘శ్రీమతి శ్రీనివాస్’ అనే సీరియల్ కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. కొన్ని కారణాల వల్ల తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.
Read More..
ఆ పార్టీ ప్రచారాల కోసం కోట్ల రూపాయల ఆఫర్.. సుహాస్ షాకింగ్ కామెంట్స్