‘ఓ రోమియో’ విషయంలో తమన్నా కీలక నిర్ణయం.. సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

కథపై నమ్మకంతో పారితోషికం వదులుకున్న స్టార్స్ నేటి కాలంలో చాలా తక్కువమంది ఉంటారు.

‘ఓ రోమియో’ విషయంలో తమన్నా కీలక నిర్ణయం.. సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: కథపై నమ్మకంతో పారితోషికం వదులుకున్న స్టార్స్ నేటి కాలంలో చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో విక్రాంత్ మాస్సే(Vikrant Massey), తమన్నా భాటియా(Tamannaah Bhatia) చేరిపోయారు. దర్శకుడు విశాల్ భరద్వాజ్(Vishal Bhardwaj) తెరకెక్కిస్తున్న ‘ఓ రోమియో’ విషయంలో విక్రాంత్, తమన్నా కథపై ఉన్న గౌరవంతో, దర్శకుడిపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా పనిచేశారని విశాల్ భరద్వాజ్ స్వయంగా వెల్లడించారు. విక్రాంత్ మాస్సే గురించి మాట్లాడుతూ.. ఆయన కెరీర్ తొలినాళ్లలోనే ఈ ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యారని విశాల్ తెలిపారు. ‘12త్ ఫెయిల్’తో భారీ సక్సెస్ అందుకున్నాక కూడా, విక్రాంత్ తన పాత మాటను నిలబెట్టుకున్నారు.

విశాల్ భరద్వాజ్ రూపొందించిన ‘మక్బూల్’ సినిమా చూసి స్ఫూర్తి పొంది తాను నటుడిగా మారానని, అందుకే ఆయనపై గౌరవంతో ఈ సినిమాలో 8-9 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొని తన వంతు పాత్ర పోషించానని విక్రాంత్ తెలిపారు. తమన్నా భాటియా కూడా ఈ సినిమా బడ్జెట్ పరిమితులను అర్థం చేసుకుని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించడానికి ఒప్పుకున్నారని తెలిపారు. ఆమె పాత్ర నిడివి తక్కువైనా, కథలో చాలా కీలకమని దర్శకుడు చెప్పారు. సుమారు 12 రోజుల పాటు తమన్నా ఈ సినిమా షూటింగ్‌లో, వర్క్‌షాప్స్‌లో పాల్గొనడం విశేషం. భారీ బడ్జెట్‌తో ‘ఓ రోమియో’ సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్, త్రిప్తి డిమ్రి జంటగా నటిస్తుండగా.. అవినాష్ తివారీ, నానా పటేకర్, దిశా పటానీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Next Story