ఒక్క క్షణం తీరిక లేదు.. ఒకరి తర్వాత ఒకరు నా వెంటపడ్డారు

by Kodari Anjali |   (  Updated:2023-07-21 11:58:07  IST  )

ఒక్క క్షణం తీరిక లేదు.. ఒకరి తర్వాత ఒకరు నా వెంటపడ్డారు
X

దిశ, సినిమా: గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణాలను వెల్లడించింది తాప్సీ. తాజాగా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించిన ఆమె.. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఇన్ని రోజులు ఎందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు? అని అడగగా.. ‘ఒక్క క్షణం పాటు తీరిక లేదు. దర్శకనిర్మాతలు టైమ్ ఇవ్వలేదు. వరుస సినిమా షూటింగ్‌‌లతో బిజీగా ఉండటం వల్లే కాస్త గ్యాప్ తీసుకున్నా. అంతకుమించి మరో కారణం లేదు’ అని చెప్పింది. అలాగే ప్రస్తుతం షారుఖ్‌తో కలిసి ‘డుంకీ’ సినిమాలో నటిస్తున్నట్లు అభిమానులకు చెప్పిన నటి.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందని, బాద్‌షా, డైరెక్టర్ రాజ్‌కుమార్‌ హిరానీతో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో విషయాలను నేర్చుకోగలమంటూ వాళ్లపై ప్రశంసలు కురిపించింది. చివరగా తన అలవాట్లు, ఇష్టాలకు సబంధించిన విషయాలను కూడా ఫాలోవర్లతో చెప్పుకుంటూ అలరించింది.

Read more : disha newspaper

Movie News & Gossips




Next Story