రక్తనాళంలో 95 శాతం మూసుకుపోయింది.. గుండె పోటుపై సుష్మితా లైవ్ సెషన్

by Disha Web Desk 7 |
రక్తనాళంలో 95 శాతం మూసుకుపోయింది.. గుండె పోటుపై సుష్మితా లైవ్ సెషన్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి సుస్మితా సేన్ ఇటీవల గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తెలపడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే.. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉన్నానంటూ లైవ్ సెషన్‌లో తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో ప్రధాన రక్తనాళంలో 95 శాతం మూసుకుపోయింది. యాంజియో ప్లాస్టీ చేశారు. నా జీవితంలో ఇదో పెద్ద దశ. కానీ.. నేను బయపడలేదు. ఇప్పుడు నాకు అంతా బాగానే ఉంది. డాక్టర్లు నా ప్రాణాలు కాపాడారు వారికి ధన్యవాదాలు’’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు, శ్రేయాభిలాషులు అభినందనలు తెలుపుతున్నారు.



Next Story

Most Viewed