ముంబై వరదల కారణంగా సర్వం కోల్పోయిన సన్నీ లియోన్.. ఏడుపే మిగిలిందంటూ..

by Disha Web Desk 10 |
ముంబై వరదల కారణంగా సర్వం కోల్పోయిన సన్నీ లియోన్.. ఏడుపే మిగిలిందంటూ..
X

దిశ, సినిమా : హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ముంబై వరదల కారణంగా ఆర్థికంగా నష్టపోయానని తెలిపింది. ఈ వర్షాకాలంలో భారీ నష్టాన్ని చవిచూశానని ఓ చానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఫారిన్ నుంచి ఇండియాలో షూటింగ్‌కు అటెండ్ అయ్యేందుకు వచ్చిన తాను.. ముందుగా వానలను ఆస్వాదించానని, కానీ చివరకు మాత్రం కన్నీరే మిగిలిందని బాధపడింది. సముద్రానికి దగ్గరగా ఉన్న తన ఇంటి గోడలు పూర్తిగా నాశనం అయిపోయాయని, వస్తువులన్నీ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయ్యాయయని.. రెండు రోజుల వ్యవధిలోనే మెర్సిడెస్ ట్రక్‌తో పాటు మూడు విలువైన కార్లను పోగొట్టుకున్నట్లు చెప్పింది. ఇక ఈ ఇంపోర్టెడ్ కార్స్ ఇండియాకు దిగుమతి చేసుకున్నప్పుడు పన్ను భారీగా చెల్లించానని.. తలుచుకుంటే ఇంకా ఎక్కువ బాధేస్తోందని చెప్పుకొచ్చింది సన్ని.

Read More: ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఏడు పాత్రల్లో కనిపించబోతున్న రామ్ చరణ్..?


Next Story