స్టూడెంట్స్‌కు స్కూటీలు అందజేసి గొప్ప మనసు చాటుకున్న Samyuktha Menon

by Disha Web Desk 9 |
స్టూడెంట్స్‌కు స్కూటీలు అందజేసి గొప్ప మనసు చాటుకున్న Samyuktha Menon
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్‌గా పేరు సంపాదించుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్. ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సరసన నటించి.. అతితక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం ‘‘వీరూపాక్ష’’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఇటీవలే ఈ సినిమా విజయంతో చిత్ర బృందం.. ఓంకార్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న బుల్లితెర ప్రోగ్రామ్ ‘‘సిక్త్స్ సెన్స్‌’’లో పాల్గొని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ షోలో అన్ని టాస్క్‌లు గెలిస్తే స్కూటీ అందజేస్తామని ఓంకార్‌ అనౌన్స్ చేయగా.. విరూపాక్ష టీమ్‌ ఆ స్కూటీని గెలిస్తే అక్కడున్న విద్యార్థులకు ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాం అని చెప్పారు. ఆ గేమ్‌లో హీరోయిన్ గెలిచింది. దీంతో ఆ స్కూటీని సంయుక్త అక్కడున్న స్టూడెంట్స్‌లో ఇద్దరిని ఎంపిక చేసి.. అందులో ఒకరికి ఆ స్కూటీని ఇచ్చేశారు. మరో విద్యార్థికి స్కూటీ సొంతంగా కొనిస్తానని మాట ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు.

Read more:

ఆ హీరోయిన్ అంటే క్రష్.. నాగచైతన్య కామెంట్స్ వైరల్

Next Story

Most Viewed