17 కోట్లు పెట్టి లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన స్టార్ హీరో తల్లి

by Disha Web Desk 9 |
17 కోట్లు పెట్టి లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన స్టార్ హీరో తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అలియా భట్‌ను ప్రేమ వివాహం చేసుకుని పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే హీరో తల్లి నీతూ కపూర్ తాజాగా.. బాంద్రాలోని కుర్లా కాంప్లెక్స్‌లో ఆమె విలాసవంతమైన 4 బీహెచ్ కె ఫ్లాట్‌ను ఏకంగా 17 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందట. ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం ఆమె 1.04 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు సమాచారం. దాదాపు రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయినట్లేనట. అయితే ఈ ఏజ్‌లో ఆమె అంత ఖరీదైన ఫ్లాట్ ఎందుకు కొన్నది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నెట్టింట ఇది హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం తను పాలి హిల్‌లో ఒక భవనంలో ఉంటున్నారు. ఇక నీతూ కపూర బాలీవుడ్‌లో సూరజ్ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. 1980లో రిషి కపూర్‌ను వివాహం చేసుకుంది.

ఇవి కూడా చదవండి:

ట్రాన్స్‌జెండర్‌కు అందలం.. మురిసిపోతున్న కమ్యూనిటీ..

Next Story