Soundarya: సౌందర్య ఎఫైర్ల గురించి తెలుసా?

by Disha Web Desk 10 |
Soundarya: సౌందర్య ఎఫైర్ల గురించి తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : సౌందర్య ఒక ప్రముఖ సినీ నటి. తెలుగు, తమిళం , కన్నడ , మలయాళ భాషల్లో 100 కు పైగా చిత్రాలలో నటించారు. ఆమె అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కొరకు సౌందర్యగా మార్చుకుంది. ఆమె ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా ఆమె తండ్రికి స్నేహితుడైన ఒకరు 1992లో గంధర్వ చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. అమ్మోరు చిత్రం హిట్ అందుకున్న తర్వాత ఆమె చదువునూ మధ్యలోనే ఆపేసి పూర్తిగా చిత్రసీమలోకి అడుగుపెట్టింది. తెలుగు సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్న సౌందర్యకు అప్పట్లో చాలా ఎఫైర్లు ఉన్నాయని ఇండ్రస్ట్రీలో గుస గుసలు వినిపించాయి.

సౌందర్య వెంకటేష్‌తో ఎక్కువ సినిమాలు చేసింది. అప్పట్లో వెంకటేష్, సౌందర్య నటించిన రాజా, పెళ్లి చేసుకుందాం రా, జయం మనదేరా.. ఇలా ఇద్దరు కలిసి నటించిన ప్రతి సినిమా హిట్ అయింది. వీరిద్దరి మధ్య ఏదో ఉందని గుస గుసలు వినిపించాయి. వెంకటేశ్ రామానాయుడు కొడుకు అవ్వడం వల్లేమో కానీ ఈ విషయం బయటికి రాలేదు. కానీ ఆ తర్వాత సౌందర్య , జగపతి బాబుతో ఎక్కువ సినిమాలను చేసింది. ఆ తరుణంలో సౌందర్యకు , జగపతి బాబుకు మధ్య ఎఫైర్ నడిచిందని కోడై కూసింది. అప్పుడు దీనిని ఎవరు ఖండించకపోవడంతో ఇది నిజమేనని అనుకున్నారట. తాజాగా జగపతి పతి ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ విషయాలను వెల్లడించారు.

Next Story

Most Viewed