- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో కొందరు డబ్బులు ఖర్చు చేసి ఇతరులను కిందికి లాగేందుకు చూస్తున్నారు.. తాప్సీ ఘాటు వ్యాఖ్యలు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను(Taapsee Pannu) ఇటీవల సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను(Taapsee Pannu) ఇటీవల సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఏ కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించకపోయినా, వరుస ఇంటర్వ్యూలతో మాత్రం వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఆమె చేస్తున్న స్పష్టమైన, సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా బాలీవుడ్లో నడుస్తున్న పీఆర్ గేమ్పై తాప్సీ ఘాటు విమర్శలు చేశారు. ‘‘నేను నా పనులతో చాలా బిజీగా ఉన్నాను. కానీ గత 1.5-2 సంవత్సరాలుగా నేను పనుల వేగాన్ని తగ్గించాను, ఇది నేను ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయమే. ఈ పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) ఆట మరో స్థాయికి వెళ్లిపోయిందని నేను గ్రహించాను.
ఒకప్పుడు పీఆర్ అంటే మన గురించి మంచి మాటలు ప్రచారం చేయడం. ఇప్పుడు మాత్రం మనల్ని పైకి తీసుకెళ్లడమే కాదు, ఇతరులను కిందికి లాగడానికి కూడాడబ్బులు ఖర్చు చేస్తున్నారు. మీ విజయం ఇంకొకరి వైఫల్యంపై ఆధారపడాల్సిన అవసరం ఎప్పటి నుంచి వచ్చింది?” అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం చాలామంది కేవలం రీలెవెన్స్ కోసం తమ వ్యక్తిత్వానికే కొత్త ముసుగు వేసుకుంటున్నారని ఆమె విమర్శించారు. కేవలం సినిమా హిట్తోనే సరిపోదని, సినిమాలకతీతంగా బలమైన వాయిస్ ఉండాలనే ట్రెండ్ పెరిగిందని తాప్సీ అన్నారు. కానీ బయట చూపించే ఆ వాయిస్కు, చేసే పనికి పొంతన లేకపోవడమే అసలు సమస్య అని ఆమె స్పష్టం చేశారు. నేను నా డబ్బును నాపై, నా కుటుంబంపై, నాకు దగ్గరైన వాళ్లపై ఖర్చు చేయడానికే ఇష్టపడతాను. నన్ను ప్రశంసిస్తూ వ్యాసాలు రాయడానికి, నన్ను పొగడడం కోసం మాత్రమే సోషల్ మీడియా ఖాతాలకు రూ. 50 వేలు చెల్లించడానికి నా దగ్గర అంత డబ్బు లేదు” అంటూ స్పష్టంగా చెప్పారు.
Read More..






