ఒంటరిగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్నేహ రెడ్డి.. ఎందుకో తెలుసా?

by Disha Web Desk 6 |
ఒంటరిగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్నేహ రెడ్డి.. ఎందుకో తెలుసా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి అందరికీ సుపరిచితమే. వీరికి అర్హ, అయాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే స్నేహరెడ్డి పిల్లలను చూసుకుంటూనే పలు బిజినెస్‌ల్లో రాణిస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇటీవల ఆమె చిన్న పిల్లల కోసం ఓ అద్భుతమైన ఐడియాతో న్యూ బిజినెస్ స్టార్ట్ చేసింది. దాని గురించి తెలిసిన వారంతా స్నేహపై ప్రశంసలు కురిపించారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, స్నేహ ఒంటరిగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అది కూడా మెట్ల మార్గంగుండా వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. అక్కడికి వెళ్లాక గుడిలో దిగిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమెతో అల్లు అర్జున్, అర్హ, అయాన్‌లు లేకపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఎక్కడికి వెళ్లినా ఫ్యామిలీతో వెళ్లే ఆమె ఒంటరిగా వెళ్లడానికి బలమైన కారణం ఉండే ఉంటుందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం ఏదైనా మొక్కు చెల్లించడానికి వెళ్లిందెమోనని? అనుకుంటున్నారు.




Next Story

Most Viewed