మీర్జాపూర్ 3’ అతిపెద్ద క్రైమ్ ఫిల్మ్ : శ్వేతా త్రిపాఠి

by Disha Web Desk 9 |
మీర్జాపూర్ 3’ అతిపెద్ద క్రైమ్ ఫిల్మ్ : శ్వేతా త్రిపాఠి
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ శ్వేతా త్రిపాఠి ‘మీర్జాపూర్ 3’ సీజన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అంతేకాదు ఈ సిరీస్‌లో సహ నటీనటులతో తనకున్న బంధం గురించి కూడా మాట్లాడింది. ‘‘మీర్జాపూర్’ను మాలో ఒక భాగంగా చూడకపోతే జీవితం అసంపూర్తిగా ఉంటుంది. నటీనటులతోపాటు మొత్తం సిబ్బంది సృజనాత్మకమైనా, మనోహరమైన వారు. నిజ జీవితంలోనూ జెమ్స్. మేమంతా ఒక కుటుంబంగా మారిపోయాం. ప్రతి రెండు వారాలకు ఒకసారి కలుసుకోవాలని భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా ప్రయాణం అద్భుతంగా కొనసాగుతోంది. ‘మీర్జాపూర్ 3’ మీరు చూడని అతిపెద్ద క్రైమ్ ఫిల్మ్ అవుతుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తోంది’ అంటూ చెప్పుకొచ్చింది.


Next Story

Most Viewed