'శాకుంతలం' కు షాక్.. మాకొద్దు బాబోయ్ అంటున్న యూఎస్ బయ్యర్లు..!

by Disha Web Desk 1 |
శాకుంతలం కు షాక్.. మాకొద్దు బాబోయ్ అంటున్న యూఎస్ బయ్యర్లు..!
X

దిశ, వెబ్ డెస్క్: గుణశేఖర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన శాకుంతలం సినిమాకు విడులకు ముందే పెద్ద షాక్ తగిలేలా ఉంది. యూఎస్ హక్కులు రూ.4 కోట్లకు కొనుగోలు చేస్తామని చెప్పిన బయ్యర్ ఇప్పుడు మాకొద్దు బాబాయ్ అంటూ వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ సమంతం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. చిత్ర నిర్మాతలు ఈ సినిమా విషయంలో ఎంత ప్రమోట్ చేసినా అంత హైప్ రావడం లేదనే టాక్ వినిపిస్తుంది.

సినిమా విడుదల ఉందనగా నెలరోజుల ముందే ప్రచారం చేస్తామని తెలిపినా.. ఆ దిశగా ప్రయత్నాలు చేయపోవడం సినిమాకు మైనస్ గా మారనుంది. ఇలాంటి సమయంలో రూ.4 కోట్లు పెట్టి సినిమాను కొనలేమంటూ యూఎస్ బయ్యర్ తెల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇక ఆంధ్ర హక్కుల విషయానికి వస్తే.. సనిమా హక్కులు రూ.8 కోట్లుకు అమ్ముడైనట్లుగా సమాచారం.

అందులో దాదాపుగా దిల్ రాజుకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లే ఉన్నారు. పరిస్థితి చేజారిపోతున్న ఈ తరుణంలో నిర్మాతలు గుణశేఖర్, దిల్ రాజు ఇప్పటు ప్రచారంపై ఎక్కువ దృష్టి సారించారు. 11 నుంచి వరుసగా ప్రీమియర్లు వేయబోతున్నారు. ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ లాంటి హిందూ సంస్థలకు మొదట సినిమాను చూపించి హడావుడి చేయబోతున్నారని సమాచారం.

Next Story