ఇంట్లో వాళ్లకు తెలియకుండా బాత్ రూమ్‌లో కూర్చుని ఏడ్చేదాన్ని : హీరోయిన్ నుపుర్‌ సనన్‌

by Disha Web Desk 9 |
ఇంట్లో వాళ్లకు తెలియకుండా బాత్ రూమ్‌లో కూర్చుని ఏడ్చేదాన్ని : హీరోయిన్ నుపుర్‌ సనన్‌
X

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రాల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒకటి. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించాడు. స్టువర్టుపురం గజదొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించగా.. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ ఈ మూవీతో హీరోయిన్‌‌గా పరిచయం కానుంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.

‘2005లో యూట్యూబర్‌గా నా కెరీర్ మొదలైంది. నేను సినిమాల్లోని పాటలు పాడేదాన్ని. ఫిల్హాల్ అనే ప్రైవేట్ ఆల్బమ్‌లో నటించను. నా అదృష్టం ఏంటంటే ఈ ఆల్బమ్ వేగంగా 100 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకున్న నా తొలి వీడియో. ఇక కృతి సనన్ నాకు అక్క మాత్రమే కాదు అమ్మ కూడా. నాకు ఏం కావాలో తనకు బాగా తెలుసు. చిన్నప్పుడు నన్ను ఎవరైనా టీజ్ చేస్తే వాళ్లను చితకబాదేది. కానీ కాలేజ్ రోజుల్లో ఒక అబ్బాయిని లవ్ చేశాను కానీ ఆ అబ్బాయి మోసం చేశాడు. చాలా బాధ అనిపించింది. అందరూ చూస్తారని బాత్ రూమ్‌లో కూర్చుని ఏడ్చేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Next Story

Most Viewed