అది కూడా ఓ పాటే నా.. ‘ఊ అంటావా..’పై సీనియర్ సింగర్ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 13 |
అది కూడా ఓ పాటే నా.. ‘ఊ అంటావా..’పై సీనియర్ సింగర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రముఖ గాయని ఎల్ ఆర్ ఈశ్వరి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ‘‘మసక మసక చీకటిలో’’, ‘‘భలే భలే మొగాడివోయ్’’.. అంటూ హస్కీ వాయిస్‌ తో ఐటమ్ సాగ్స్ పాడి ఎంతగానో ఆకట్టుకుంది. కాగా తాజాగా ఈ సింగర్ ఒక ఇంటర్వ్యూలో ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలోని పాపులర్ సాంగ్ ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా..’ పై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈశ్వరి మాట్లాడుతూ ‘‘ ‘పుష్ప’ మూవీ లో సమంత సాంగ్ విన్నాను.

అది కూడా ఒక పాటేనా? కంపోజిషన్, గానం మొదటి నుంచి చివరి వరకు ఒకే పిచ్‌పై ఉంది. గాయకులు వారి గాత్రానికి తగ్గట్లుగా పాడుతారు. కానీ తప్పులు గమనించి పాడించే బాధ్యత సంగీత దర్శకుడికి ఉంటుంది. ఒకవేళ ఆ పాట పాడే ఆఫర్ నాకు ఇచ్చి ఉంటే ఇంకా పాపులర్ అయ్యేది” అని అన్నారు ఎల్ ఆర్ ఈశ్వరి.

ఇవి కూడా చదవండి :

హోలీ స్పెషల్ డ్రెస్.. ఇన్నర్ వేర్, బ్రాతో దర్శనమిచ్చిన బోల్ట్ బ్యూటీ (వీడియో)

Next Story

Most Viewed