బరువు పెరగకుండా ఉండేందుకు తన సీక్రెట్ చెప్పిన హీరోయిన్..

by Disha Web Desk 7 |
బరువు పెరగకుండా ఉండేందుకు తన సీక్రెట్ చెప్పిన హీరోయిన్..
X

దిశ, వెబ్‌డెస్క్: ''నరసింహుడు'' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ సమీరా రెడ్డి. తర్వాత చిరంజీవికి జోడీగా 'జై చిరంజీవ' సినిమాలో అలరించిన సమీరా.. అప్పటి నుంచి టాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చినప్పటికీ బాలీవుడ్‌కే పరిమితమైపోయింది. ఇదిలా ఉంటే.. తన ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తూ.. 10 ఏళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలోనే అధిక బరువు కారణంగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంది సమీరా. అయితే తాను 11 కేజీల వరకు బరువు తగ్గానని అప్పట్లో చెప్పిన విషయం తెలిసిందే. కానీ ప్లాస్టిక్ సర్జరీ లాంటివి కాకుండా వ్యాయమాల ద్వారా తగ్గించుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఆ ఫిట్ నెస్ అలాగే ఉండేందుకు రోజుకు ఒక్క ఇడ్లీ మాత్రమే తింటున్నట్లు చెప్పుకొచ్చింది సమీరా.

Also Read...

14 ఏళ్ల తర్వాత స్టార్ హీరోతో అలరించనున్న త్రిష..


Next Story

Most Viewed