- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha: నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న సమంత ‘శుభం’మూవీ.. స్ట్రీమింగ్ డేట్పై అధికారిక ప్రకటన విడుదల
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) మయోసైటీస్ కారణంగా గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. చివరగా ‘ఖుషి’ చిత్రంలో కనిపించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) మయోసైటీస్ కారణంగా గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. చివరగా ‘ఖుషి’ చిత్రంలో కనిపించింది. ఇక ఇటీవల మళ్లీ నిర్మాతగా మారి ‘శుభం’ (Shubham) చిత్రాన్ని తెరకెక్కించింది. ట్రలాలా పిక్చర్స్ బ్యానర్ స్థాపించిన ఆమె కొత్త జర్నీ స్టార్ట్ చేసింది. అయితే ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి(Harshit Reddy), గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి నటించారు. అలాగే ఇందులో స్టార్ బ్యూటీ సమంత గెస్ట్ రోల్ చేసి ప్రేక్షకులను మరోసారి మంత్రముగ్దులను చేసింది.
అయితే ‘శుభం’ చిత్రం మే 9న థియేటర్స్లోకి వచ్చింది. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బాగానే రాణించింది. తాజాగా, ‘శుభం’ డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైనట్లు అధికారిక ప్రకటన విడుదల అయింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జియో హాట్స్టార్ సొంతం చేసుకోగా.. జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన సమంత అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






