ఎంగేజ్మెంట్ తంతు ముగియగానే జపాన్ వెళ్లిన సాయి పల్లవి.. ఎందుకో తెలుసా..?

by Disha Web Desk 7 |
ఎంగేజ్మెంట్ తంతు ముగియగానే జపాన్ వెళ్లిన సాయి పల్లవి.. ఎందుకో తెలుసా..?
X

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీగా సాయి పల్లవి నటిగా, డాన్సర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ‘ఫిదా’ సినిమాతో ఆడియన్స్‌ను ఫిదా చేసిన ఈ అమ్మడు.. కట్టు, బొట్టులో జూనియర్ సావిత్రిలా ప్రశంసలు అందుకుంటుంది. ఇక నాగచైతన్య తండేల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. అయితే.. ఇటీవల తన చెల్లి పూజకన్నన్‌ ఎంగేజ్‌మెంట్‌లో సాయి పల్లవి ఎంత సందడి చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తీన్మార్ డ్యాన్స్‌లతో అందరిని ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. సాయి పల్లవి గురించి నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..

చెల్లి ఎంగేజ్‌మెంట్ తర్వాత మన నేచురల్ బ్యూటీ సీక్రెట్‌గా జపాన్‌కు వెళ్లిందట. ఇక దీనిపై ఆరా తీయక బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం వెళ్లినట్లు సమాచారం. బాలీవుడ్ ఇండస్ట్రీకి సాయి పల్లివి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రామాయణం కథాంశంతో తెరకెక్కబోతున్న చిత్రంలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. అయితే.. దీని కంటే ముందు బాలీవుడ్‌లో మరో సినిమా సైన్ చేసిందంటా ఈ అమ్మడు. అమీర్ ఖాన్ పెద్ద కొడుకు జునైద్ ఖాన్ హీరోగా ఓ మూవీ తీయబోతున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ కూడా పూర్తవడంతో.. షూటింగ్‌లో పాల్గొనేందుకు సాయి పల్లవి జపాన్ వెళ్లిందట. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed