Pooja Kannan ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్ చేస్తూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సాయి పల్లవి

by Disha Web Desk 6 |
Pooja Kannan ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్ చేస్తూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సాయి పల్లవి
X

దిశ, సినిమా: స్టార్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య తండేల్ చిత్రంతో త్వరలో రాబోతుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. అందులో తన చెల్లి పూజా కన్నన్‌తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. వీరిద్దరు కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే సాయి పల్లవి చెల్లి కూడా నటిగా ఓ చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఆఫర్లు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం సాయి పల్లవికి షూట్స్‌కు సంబంధించినవి చూసుకుంటూ ఉంటుంది. అయితే ఇటీవల పూజా కన్నన్ తన ప్రియుడిని పరిచయం చేసిన విషయం తెలిసిందే.

అలా ప్రియుడిని పరిచయం చేసి వారం అయ్యిందో లేదో.. జవనరి 21న గ్రాండ్‌గా కుటుంబ సభ్యుల, బంధు మిత్రుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం నెట్టింట పోస్ట్ చేసింది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్చితార్థంలో సాయి పల్లవి డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఈ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, సాయిపల్లవి చెల్లి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘నా బేబీ సిస్టర్‌కు నిశ్చితార్థం అయింది. ఈ కొత్త బంధంలో మునిగిపోవడానికి తనకు కాస్త సమయం పడుతుంది. తమ్ముడికి ఏం తెలుసు అతను ఏం పొందాడో గుడ్ లక్ వినీత్.. వెల్ కమ్ టు ద ఫ్యామిలీ’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు నీకంటే చిన్న మీ చెల్లి పెళ్లి చేసుకోబోతుంది. నువ్వు ఎప్పుడు చేసుకుంటావ్? అని ప్రశ్నిస్తున్నారు.


Next Story

Most Viewed