Pooja Hegde : పూజా హెగ్డేపై సాయి పల్లవి ఫ్యాన్స్ ట్రోలింగ్

by Disha Web Desk 22 |
Pooja Hegde : పూజా హెగ్డేపై సాయి పల్లవి ఫ్యాన్స్ ట్రోలింగ్
X

దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలో నటనకి గాను బెస్ట్ హీరోయిన్ అవార్డ్ దక్కించుకుంది. అయితే ఇదే విషయంపై సాయి పల్లవి ఫ్యాన్స్ పూజను ట్రోల్ చేస్తున్నారు. విషయానికొస్తే.. సైమా అవార్డ్స్ 2022కి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో పాటు 'శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ' సినిమాలు కూడా నామినేట్ అయ్యాయి. ఈ రెండు చిత్రాల్లోనూ సాయి పల్లవి అద్భుతంగా నటించింది. అయినప్పటికీ బెస్ట్ హీరోయిన్‏ అవార్డ్ సాయి పల్లవి కాకుండా ఓ సాధారణ యువతి పాత్రలో నటించిన పూజకు రావడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైమా అవార్డ్‌ను పూజా హెగ్డే డబ్బులిచ్చి కొనుక్కుందని విమర్శిస్తున్నారు. ఈ అవార్డు వేడుకకు పూజ వస్తే పబ్లిసిటీ పెరుగుతుందని భావించే నిర్వాహకులు ఆమెకు ఈ అవార్డ్ ఇచ్చినట్లున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

#NTR30' కోసం భారీగా పెంచేసిన రష్మిక


Next Story