ఇప్పుడు నాకు ఆ ధైర్యం లేదు.. పవన్ కల్యాణ్ అభిమానులకు సాయితేజ్ విన్నపం

by Disha Web Desk 2 |
ఇప్పుడు నాకు ఆ ధైర్యం లేదు.. పవన్ కల్యాణ్ అభిమానులకు సాయితేజ్ విన్నపం
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్-సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం బ్రో. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ దేవుడి క్యారెక్టర్‌లో నటిస్తుండగా.. సాయితేజ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్‌లు కథానాయికలుగా నటిస్తు్న్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించాడు. రేపు(జులై 28) ఈ బ్రో చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో అభిమానులకు మెగా హీరో సాయిధరమ్ తేజ్ కీలక విన్నపం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆ స్పెషల్ నోట్‌ను విడుదల చేశారు. ‘సముద్రఖని గారి దర్శకత్వంలో నేను, కల్యాణ్ మావయ్య కసిలి నటించిన బ్రో.

ఈ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయం పట్ల, ప్రతి కంటెంట్ గురించి మీరు ఆసక్తి కనబరిచి విడుదలకు ముందే బ్యానర్లు, కటౌట్లతో ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చారు. ఇంకా చాలా విధాలుగా మీ అభిమానాన్ని చాటుతూ వచ్చారు. మీరు ఇష్టంగా చేసుకునే సంబురాలను మేము కాదనలేము. అయితే, అదే సమయంలో అతి జాగ్రత్తగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను కూడా ద‌ృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా సంబురాలను జరుపుకోండి. ఈ సంబురాల్లో మీకేదైనా జరిగితే తట్టుకునేంత ధైర్యం ఇప్పుడు నాకు లేదు. మీ ప్రేమను పొందాలని ఎంత ఉన్న, మీరు సురక్షితంగా ఉండటం దానికంటే ముఖ్యం. కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను’ అని సోషల్ మీడియా వేదికగా అభిమానులను సాయితేజ్ వేడుకున్నారు.

Read More : నా కంటే స్టార్ కిడ్స్ గొప్పగా నటిస్తారా? కృతి సనన్ కామెంట్స్ వైరల్

Next Story

Most Viewed