మహేష్ బాబు, అల్లు అర్జున్ కు పోటీగా రవితేజ.. పేరుకు తగ్గట్టుగానే మాస్ ఏరియాలో మ‌ల్టీప్లెక్స్

by Dishafeatures1 |
మహేష్ బాబు, అల్లు అర్జున్ కు పోటీగా రవితేజ.. పేరుకు తగ్గట్టుగానే మాస్ ఏరియాలో మ‌ల్టీప్లెక్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరోలు ఒక్కొక్కరు వరుస మూవీ హిట్ లతో దూసుకుపోతూ, వచ్చిన డబ్బుతో బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నారు.థియేట‌ర్స్ మ‌ల్టీప్లెక్స్‌లు ప్రారంభిస్తున్నారు. మొద‌ట‌గా టాలీవుడ్ స్టార్ మ‌హేష్‌ బాబు ‘ఏఎంబీ’ పేరుతో హైద‌రాబాద్‌లో మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ ప్రారంభించగా.. మ‌హేష్ స్ఫూర్తితో అల్లు అర్జున్ ‘AAA’ పేరుతో థియేట‌ర్ నిర్మించాడు. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ‘ఏవీడీ’ థియేట‌ర్‌ను ర‌న్ చేస్తున్నాడు. ఏషియ‌న్ సంస్థ భాగ‌స్వామ్యంతో మ‌హేష్‌, బ‌న్నీ, విజ‌య్ దేవ‌ర‌కొండ థియేట‌ర్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు.

కాగా తాజాగా మస్ రాజా రవితేజ కూడా వీరి బాట‌లోకే ఎంట్రీ ఇస్తోన్నాడు. హైద‌రాబాద్‌లోని దిల్‌షుక్‌న‌గ‌ర్‌లో ఓ మ‌ల్లీప్లెక్స్ థియేట‌ర్ నిర్మించ‌బోతున్నట్లు స‌మాచారం. ఈ మ‌ల్టీప్లెక్స్‌కు ఏషియ‌న్ ర‌వితేజ పేర్లు కలిసి వచ్చేలా ‘ఏఆర్ టీ సీనిమాస్’ అనే పేరు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఏషియ‌న్ సంస్థతో క‌లిసి ర‌వితేజ నిర్మిస్తున్నా ఈ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్‌ మొత్తం ఆరు స్క్రీన్స్‌తో స్టార్ట్ చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కగా ఈ ఏషియ‌న్ ర‌వితేజ గురించి తొంద‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్ రానుంది.

Read More..

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఇకపై మహేష్ బాబుని చూడలేరు

Next Story