- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మాస్ జాతర’ విషయంలో తగ్గేదెలా అంటున్న రవితేజ.. టీజర్తో బాక్సులు బద్దలవ్వాల్సిందే!
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నటిస్తున్న చిత్రాల్లో ‘మాస్ జాతర’ (mass jathara) కూడా ఒకటి.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నటిస్తున్న చిత్రాల్లో ‘మాస్ జాతర’ (mass jathara) కూడా ఒకటి. ఈ చిత్రాన్ని భాను భోగవరపు(Bhanu Bhogavarapu) తెరకెక్కిస్తుండగా.. డ్యాన్సింగ్ డాల్ శ్రీలీల(sreeleela) హీరోయిన్గా నటిస్తోంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా మే 9న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది.
షూటింగ్ పూర్తి కానందున ఈ మూవీని ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మూవీ మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు పలువార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, రవితేజ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్గా మారాయి. ‘మాస్ జాతర’ విడుదల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని రవితేజ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేస్తున్నట్లు సమాచారం.
తగ్గేదెలా అన్నట్లు మరోసారి ‘మాస్ జాతర’ వాయిదా పడకుండా జూలైలో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నట్లు టాక్. వినాకచవికి సినిమాను రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారట. అంతేకాకుండా జూలై రెండోవారంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను రిలీజ్ చేసి బాక్సులు బద్దలుకొట్టేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న రవితేజ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






