వెండితెరపై మరోసారి రామాయణం.. సీత పాత్రలో మెరవనున్న సాయి పల్లవి.. మరీ రాముడు ఎవరు?

by Disha Web Desk 9 |
వెండితెరపై మరోసారి రామాయణం.. సీత పాత్రలో మెరవనున్న సాయి పల్లవి.. మరీ రాముడు ఎవరు?
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, డాన్స్, అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈ భామ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ‘‘ఫిదా’’ చేసింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే ‘‘ఆదిపురుష్’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిన సంగతే. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. మరోసారి రామాయణాన్ని సిల్వర్ స్క్రీన్‌పై తెరకెక్కించనున్నారట. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. అయితే సీత పాత్రలో సాయి పల్లవి రాముడి పాత్రలో రణబీర్ కపూర్ అయితే బాగుంటుందని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఇక రావణుడిగా కండల వీరుడు హృతిక్ రోషన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.



Next Story

Most Viewed