Ram Charan: పారిస్ వీధుల్లో సందడి చేసిన రామ్‌చరణ్, పీవీ సింధు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2024-07-28 12:45:09  IST  )

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి కొట్టింది. ఎయిర్‌ పిస్టల్‌ షూటింగ్ విభాగంలో మనుభాకర్‌ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

Ram Charan: పారిస్ వీధుల్లో సందడి చేసిన రామ్‌చరణ్, పీవీ సింధు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి కొట్టింది. ఎయిర్‌ పిస్టల్‌ షూటింగ్ విభాగంలో మనుభాకర్‌ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు హైదరాబాద్ షెట్లర్ పీవీ సింధు తన తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన ప్లేయర్ అబ్దుల్ రజాక్‌పై అలవోకగా విజయం సాధించింది. ఈ క్రమంలోనే పారిస్‌ వీధుల్లో పీవీ సింధు, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ ఎదురుపడగా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ సరదాగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఒలింపిక్స్‌లో బ్యాట్మింటన్ మహిళల సింగిల్స్‌లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే, ఒలింపిక్‌ గేమ్స్‌ ప్రత్యక్షంగా వీక్షించేందుకు మెగా ఫ్యామిలీ పారిస్‌ వెళ్లగా అక్కడ రామ్‌ చరణ్‌, పీవీ సింధు యాధృచ్ఛికంగా మీట్ అవ్వడం విశేషం

లింక్ కోసం పక్కనే ఉన్న లింక్ క్లిక్ చేయండి: https://x.com/HumanTsunaME/status/1817505922597670913

Next Story