- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను కలిసిన రామ్ చరణ్.. కారణం ఏంటంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ఒక సాంగ్ షూటింగ్ ప్రస్తుతం మైసూర్ లో జరుగుతుంది.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ఒక సాంగ్ షూటింగ్ ప్రస్తుతం మైసూర్ లో జరుగుతుంది. ఈ సందర్భంగా.. ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddharamaiah)గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. సిద్ధరామయ్య ఆహ్వానం మేరకు రామ్ చరణ్ మర్యాద పూర్వకంగా కలుసుకుని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా.. ‘పెద్ది’(peddi) సినిమా గురించి కొన్ని విశేషాలు రామ్ చరణ్ సిద్ధరామయ్యకు తెలిపారు. అలాగే సినీ అంశాలు కూడా కొన్ని వీరి మధ్య చర్చకు వచ్చాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఒక భారీ సాంగ్ షూటింగ్ ప్రస్తుతం మైసూర్ లో శరవేగంగా జరుగుతోంది. సుమారు 1000 మందికి పైగా డాన్సర్లతో ఈ పాట షూట్ చేస్తున్నారు మేకర్స్. ‘పెద్ది’ చిత్రాన్ని బుచ్చిబాబు(buchibabu) డైరెక్ట్ చేస్తుండగా వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సమర్పిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






