‘మేమ్ ఫేమస్’ యూత్‌తో పాటు పెద్దలకు కనెక్ట్ అవుతుంది : నిర్మాతలు

by Dishanational2 |
‘మేమ్ ఫేమస్’ యూత్‌తో పాటు పెద్దలకు కనెక్ట్ అవుతుంది : నిర్మాతలు
X

దిశ, సినిమా : ‘మేమ్ ఫేమస్’ యూత్‌కే కాదు పెద్దలకు కూడా బాగా కనెక్ట్ అయ్యే సినిమా అని తెలిపారు నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్. సుమంత్ ప్రభాస్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ప్రధానపాత్రల్లో కనిపించబోతుండగా.. ఈ నెల 26న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిర్మాతలు.. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్‌పై సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ‘రైటర్ పద్మభూషణ్’తో జర్నీ స్టార్ట్ చేశామని.. ఇది తమ రెండో ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. త్వరలోనే మూడో సినిమాతో రాబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గీతా ఆర్ట్స్‌, ఓవర్సీస్‌‌లో సరిగమ సినిమాస్‌ విడుదల చేస్తున్నాయని.. వైజాగ్‌‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌ డిస్ట్రిబ్యూటర్‌‌గా వ్యవహరిస్తోందని తెలిపారు.

Also Read..

‘బిచ్చగాడు-2’ ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ..

Next Story

Most Viewed