షారుఖ్ నన్ను గుర్తుపెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది: ప్రియమణి

by Disha Web Desk 9 |
షారుఖ్ నన్ను గుర్తుపెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది: ప్రియమణి
X

దిశ, సినిమా: పదేళ్ల తర్వాత కూడా షారుఖ్ ఖాన్ తనను గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందంటోంది ప్రియమణి. రోహిత్ శెట్టి తెరకెక్కించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో షారుఖ్‌తో కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేసిన ఆమె.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ‘జవాన్’లో అవకాశం రావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘నిజంగా ఇదొక మాయ. అతను నన్ను గుర్తుంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకాలం తర్వాత కలిసినా.. బాగా తెలిసిన వ్యక్తిలాగే నన్ను మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాడు ఎస్‌ఆర్‌కే. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ తర్వాత మిమ్మల్ని చూడటం చాలా బాగుందని చెప్పాడు’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది. ఇక అట్లీకుమార్ తెరకెక్కిస్తున్న ‘జవాన్’ సెప్టెంబర్ 7న విడుదలకానుండగా.. షారుఖ్ సరసన నయనతార నటిస్తోంది. విజయ్ సేతుపతి, సన్య మల్హోత్రా, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.




Next Story

Most Viewed