స్టార్ హీరోను పబ్లిక్‌గా క్షమించమని అడిగిన ప్రకాష్ రాజ్.. ట్వీట్ వైరల్

by Disha Web Desk 6 |
స్టార్ హీరోను పబ్లిక్‌గా క్షమించమని అడిగిన ప్రకాష్ రాజ్.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో సిద్ధార్థ్ కు బెంగళూరులో అవమానం జరిగిన విషయం తెలిసిందే. చిత్తా అనే సినిమా ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్ళిన సిద్ధార్థ్ ను కొంతమంది నిరసనకారులు అడ్డుకున్న విషయం విధితమే. కావేరి నదీ జలాలకు సంబంధించి వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ ప్రెస్ మీట్ పెట్టడంతో ఆగ్రహించిన నిరసనకారులు ఆ ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు. దీంతో సిద్దార్థ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

తాజాగా, ఈ సంఘటనపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘దశాబ్దాల నాటి ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైన అన్ని రాజకీయ పార్టీలను, నాయకులను ప్రశ్నించకుండా.. కేంద్రం జోక్యం చేసుకోవాలని ఒత్తిడి చేయని పనికిమాలిన పార్లమెంటేరియన్లను ప్రశ్నించకుండా .. సామాన్యులను, కళాకారులను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. కన్నడిగుడిగా .. కన్నడిగుల తరపున సిద్దార్థ్ క్షమించు’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed