రణబీర్ కపూర్ ‘యానిమల్’ ట్రైలర్‌పై.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన ప్రభాస్

by Disha Web Desk 6 |
రణబీర్ కపూర్ ‘యానిమల్’ ట్రైలర్‌పై.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన ప్రభాస్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం ‘యానిమల్’. దీనికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అయితే నిన్న యానిమల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్‌ ఆడియన్స్‌ని కన్నీళ్లు పెట్టిస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది.

తాజాగా, యానిమల్ ట్రైలర్‌పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. ‘‘ ట్రైలర్ అదిరిపోయింది.. మెంటల్ అంటూ మూవీ టీమ్‌కు ఆల్ దిబెస్ట్ తెలిపాడు. అలాగే ఈ సినిమా రిలీజ్ అయ్యేదాక ఆగలేకపోతున్నాను’’ అని రాసుకొచ్చాడు. అలాగే ట్రైలర్‌ను కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సలార్ షూటింగ్ జరుగుతుంది. అలాగే ప్రభాస్, సందీప్ వంగా కలయికలో కూడా ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘స్పిరిట్’ అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు.




Next Story

Most Viewed