అయోధ్య రామ భక్తుల కోసం ప్రభాస్ 50 కోట్ల విరాళం.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్

by Disha Web Desk 10 |
అయోధ్య రామ భక్తుల కోసం ప్రభాస్ 50 కోట్ల విరాళం.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్
X

దిశ, సినిమా: కోట్లాది మంది హిందువుల కల జనవరి 22 న సాకారం కానుంది. అయోధ్యలో రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత మూడు రోజుల నుంచి సినీ నటుడు ప్రభాస్ గురించి ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. రామ మందిరానికి ప్రభాస్ రూ. 50 కోట్లు విరాళం ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రామ మందిర వేడుకు హాజరవుతున్న భక్తుల ఆహార ఏర్పాట్ల కొరకు ప్రభాస్ ఈ విరాళాన్ని ఇచ్చారనే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలోని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కూడా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, భక్తుల ఆహార ఖర్చులను ప్రభాస్ భరిస్తున్నారని చెప్పారు. దీంతో అందరూ నిజమనే భావించారు. తాజాగా ఈ వార్తలపై ప్రభాస్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తల్లో నిజం లేదని ఇదంతా ఫేక్ అని ఆయన టీమ్ తెలిపింది. మొత్తానికి ఇది ఫేక్ న్యూస్ అని తేలింది. అసలు ప్రభాస్ కు ఆహ్వానం అందిందా? లేదనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈలోపే ఈ వార్త వైరల్ అయింది.

Next Story

Most Viewed