నేను శుభాకాంక్షలు చెబితే ప్రభాస్ పట్టించుకోలేదు: Rishabh Shetty

by Disha Web Desk 7 |
నేను శుభాకాంక్షలు చెబితే ప్రభాస్ పట్టించుకోలేదు: Rishabh Shetty
X

దిశ, సినిమా: 'కాంతార' మూవీ రిలీజై నెలలు గడుస్తున్నా అభిమానుల్లో ఇంకా సినిమా గురించి చర్చ నడుస్తూనే ఉంది. కేవలం రూ.16 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం రూ.400 కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డులు సృష్టించింది. దీంతో సినిమాపై రాజకీయ ప్రముఖులు, స్టార్ హీరోలు ప్రశంసల వర్షం కురిపించారు. కాగా ఒక ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. 'ఆ రోజు ప్రభాస్ బర్త్ డే. నేను అయనకు విష్ చేద్దామని కాల్ చేశా. కానీ, నా మాటలు పెద్దగా పట్టించుకోకుండా 'కాంతారా' గురించే మాట్లాడారు' అని సంతోషంగా చెప్పుకొచ్చాడు రిషబ్.

Next Story

Most Viewed