అటకెక్కిన 'పవర్ పేట'.. శర్వాతో చైతన్య నెక్స్ట్..??

by Web Desk |
అటకెక్కిన పవర్ పేట.. శర్వాతో చైతన్య నెక్స్ట్..??
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన లేటెస్ట్ మూవీ 'పవర్ పేట'ను స్టార్ట్ చేశాడు. కానీ నితిన్ ప్రస్తుత మార్కెట్ కారణంగా మేకర్స్ బడ్జెట్ విషయంలో కాస్త తటపటాయిస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా బడ్జెట్ పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటోందని కూడా టాక్ వచ్చింది. దీంతో దర్శకుడు కృష్ణ చైతన్య ప్రస్తుతానికి ఈ సినిమాను అటకెక్కించాడట. చైతన్య తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టాడని టాక్ వినిపిస్తోంది.

తన తదుపరి సినిమా కోసం ప్లాన్ రెడీ చేశాడట. ఈ సినిమాలో శర్వానంద్‌ హీరోగా చేయనున్నాడట. ఈ సినిమా శర్వానంద్ కొత్తగా కనిపిస్తాడని, చైతన్య శర్వా కోసం పాత్రలో కొత్తదనాన్ని యాడ్ చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఏమైనా వస్తుందేమో చూడాలి.

Next Story

Most Viewed