- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తరచూ చావు గురించి మాట్లాడుతున్న పోసాని.. కారణం ఇదేనా?
దిశ, వెబ్డెస్క్: టాలీవుడ్ స్టార్ కమెడియన్ పోసాని కృష్ణ మురళి కొద్దిరోజుల నుంచి తన చావు గురించి పదే పదే మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా ‘ఇప్పటికిప్పుడు ఎవరైనా నా గొంతు కోసి చంపినా నాకు ఎలాంటి దిగులు లేదు. నేను చనిపోతే నా శవాన్ని చూడటానికి ఎవరు రావడానికి వీల్లేదు. నా భార్యను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను.
నీ కంట్లో నుంచి చిన్న కన్నీటి బొట్టు కూడా కార్చొద్దని చెప్పాను.’’ అంటూ పలు కామెంట్లు చేశారు. ఈయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో.. ‘ప్రతిపక్షాల నుంచి ఆయనకు చంపేస్తామని బెదిరింపులు కానీ ఏమైనా వస్తున్నాయో అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గతంలో పవన్ కల్యాణ్ అభిమానులు పోసానిపై తీవ్రంగా మండిపడుతూ మాట్లాడిన సంగతి తెలిసిందే. టీడీపీ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నందునే ప్రస్తుతం ఈయనను టార్గెట్ చేస్తున్నారని జనాలు అంటున్నారు. పదే పదే చావు గురించి తీస్తున్నాడంటే పోసానిని ఎంతలా టార్చర్ చేస్తున్నారో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.