మహేష్ బాబు వేధించడంతో ‘గుంటూరు కారం’ సినిమా నుంచి తప్పుకున్న పూజా.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్

by Disha Web Desk 7 |
మహేష్ బాబు వేధించడంతో ‘గుంటూరు కారం’ సినిమా నుంచి తప్పుకున్న పూజా.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ అనంతరం.. మరో అప్ డేట్ రాలేదు ఈ మూవీ నుంచి. దీంతో అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఆ వార్తలను మరింత నిజం చేస్తూ నెట్టింట ఓ ట్వీట్ హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది.

అదేంటంటే సినిమా ఫోటో షూట్ సందర్భంగా మహేష్ బాబు పూజా హెగ్డేని వేధించాడట. ఈ కారణం చేతనే ఆమె సినిమా నుంచి తప్పుకుందట. ఈ విషయాన్ని తెలిపింది మరెవరో కాదు. తనను తాను సినీ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు. ఈ మేరకు.. ‘‘గుంటూరు కారం ఫోటో షూట్ సందర్భంగా మహేష్ బాబు పూజా హెగ్డేని వేధించారు! అందుకే వెంటనే సినిమా నుంచి తప్పుకుంది’’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారి తీసేలా మారింది.

Next Story